ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

ఎఫ్ఎంసి ఇండియా నీటి నిర్వహణ మరియు సుస్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది

సుస్థిర వ్యవసాయమును పెంపొందించే తన నిబద్ధతకు అనుగుణంగా, 18 రాష్ట్రాల వ్యాప్తంగా 400 కు పైగా రైతుల సమావేశాలను నిర్వహించడం ద్వారా, దేశవ్యాప్తంగా వ్యవసాయదారుల సమాజములో 14,000 కంటే ఎక్కువ మందిని చేరుకుంటూ మార్చి 22, 2021 తేదీన ఎఫ్ఎంసి ఇండియా ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంది.

భారతదేశ నీటి పోర్టల్ ప్రకారం, భారతదేశంలో ఉపయోగించే ఉపరితల నీటిలో 80 శాతం కంటే ఎక్కువ భాగాన్ని వ్యవసాయం ఉపయోగించుకుంటోంది, ఇది విపరీతంగా పెరుగుతున్న భూఉష్ణోగ్రతల వలన పెరుగుతున్న నీటి కొరతకు మరో కారణం అవుతుంది. వ్యవసాయంలో నీటి నిర్వహణను ప్రోత్సహించుటలో సహాయపడేందుకై, ఎఫ్ఎంసి క్షేత్ర సాంకేతిక నిపుణులు వ్యవసాయ సుస్థిరత్వాన్ని పెంచడానికి రైతులతో మంచి వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడారు మరియు నీటిని సమర్థవంతంగా వినియోగించడానికి, సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు నీటిని సంరక్షించడానికి వివిధ పద్ధతులను తెలియజేశారు.

Water Stewardship

తక్కువ నీటి నాణ్యత వలన కలిగే ప్రమాదాలపై ప్రజా అవగాహనను పెంచడానికి సురక్షితమైన త్రాగునీటి ప్రాముఖ్యతను కూడా ఎఫ్ఎంసి బృందం ఎత్తి చూపింది. తక్కువ నాణ్యత గల నీటి వినియోగం దేశంలో తీవ్రమైన నీటి-జనిత వ్యాధులకు దారితీసింది, మరియు ఇది రైతు కుటుంబాలపై తీవ్రమైన పరిణామాలు కలిగి ఉండే గ్రామీణ ప్రాంతాలలోనైతే మరీ భయంకరంగా ఉంది.   

ఎఫ్ఎంసి ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ ప్రమోద్ తోటా ఈ విధంగా అన్నారు, "ఈ ప్రపంచ నీటి దినోత్సవం నాడు, తాజా నీటి వనరుల సుస్థిర నిర్వహణను మెరుగుపరచడానికి అవలంభించాల్సిన ఉత్తమ పద్ధతుల గురించి రైతులకు శిక్షణ ఇవ్వడం పై మేము దృష్టి సారించాము. భారతదేశంలో గత మూడు దశాబ్దాలుగా వివిధ క్రాప్ చైన్లు మరియు ప్రాంతాలలో రైతులతో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం ద్వారా సుస్థిరతను సాధించడానికి మరియు ఉత్పాదకతను పెంచడానికి కృషి చేస్తున్నాము. మా వద్ద దాదాపుగా 4,000 సాంకేతిక క్షేత్ర స్థాయి నిపుణులు ఉన్నారు, వారు ప్రతి సంవత్సరం ఇరవై లక్షలకు పైగా రైతులను కలిసి మంచి భవిష్యత్తు కోసం నిర్వహణీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం గురించి వివరిస్తారు. ప్రాజెక్ట్ సమర్థ్ మరియు ఉగమ్ వంటి వివిధ చొరవలు మరియు కమ్యూనిటీ అవుట్‌రీచ్ కార్యక్రమాల ద్వారా రైతు సమాజమును సాధికారపరచడం మరియు వారి జీవన ప్రమాణాలను పెంచడం మా లక్ష్యంగా ఉంది.”

భారతదేశంలో తదుపరి మూడు సంవత్సరాల్లో 200,000 రైతు కుటుంబాలకు సురక్షితమైన మరియు మంచి త్రాగునీటికి ప్రాప్యతను అందించాలని ఏకైక లక్ష్యంతో కొనసాగే ప్రాజెక్ట్‌ను ఎఫ్ఎంసి ఇండియా నిర్వహిస్తుంది. ఈనాటి వరకు, ఉత్తర ప్రదేశ్ మరియు పంజాబ్ రాష్ట్రాలలో దాదాపు 120,000 వ్యవసాయ కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ ప్రాజెక్ట్ సమర్థ్ 44 కమ్యూనిటీ నీటి శుద్ధి ప్లాంటులను నెలకొల్పింది. ఈ సంవత్సరం నుండి ప్రారంభిస్తూ మరో ఐదు రాష్ట్రాలను కవర్ చేయడానికి కంపెనీ ఇప్పుడు తన చేరువను విస్తరిస్తోంది.

ఎఫ్ఎంసి ఉగమ్ అనేది డిసెంబర్ 5వ తేదీ 2020 న ప్రపంచ నేల దినోత్సవం రైతులకు అవగాహన, జ్ఞానం మరియు వారి మట్టిని మరింత స్థిరమైన పద్ధతిలో నిర్వహించే సాధనాలతో సాధికారత సాధించడం. ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు యూట్యూబ్ వంటి డిజిటల్ ఛానెళ్ల ద్వారా 100,000 కు మించి 40,000 కంటే ఎక్కువ రైతులకు ఈ ప్రచారం చేరుకుంది.

"భవిష్యత్తు తరాల కొరకు పర్యావరణాన్ని సంరక్షించుకుంటూనే క్షేమకరమైన మరియు సురక్షితమైన ఆహార సరఫరాను నిర్వహించే ఉత్పత్తులను అందించడానికి ఎఫ్ఎంసి కట్టుబడి ఉంది" అని తోట గారు అన్నారు. "అదే సమయంలో, నీటి జనిత వ్యాధుల నుండి రక్షణ కల్పించడం మరియు భూగర్భజల వ్యవస్థలను పరిరక్షించడంతో సహా దేశంలో నీటి వాడకం యొక్క సమర్థ నిర్వహణకు సంబంధించిన సమస్యలలో కొన్నింటిని ఎఫ్ఎంసి గుర్తిస్తుంది. ఆకలి లేని సమాజం మరియు స్వచ్ఛమైన నీరు మరియు పారిశుధ్యము అనే ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు మద్దతునివ్వడంపై ఎక్కువగా మా పని దృష్టి సారిస్తుంది.”

Water Stewardship