ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

వ్యవసాయంలో ప్రతిభను పెంపొందించడానికి గాను ఎఫ్ఎంసి ఇండియా జిబి పంత్ విశ్వవిద్యాలయంతో సమన్వయాన్ని కుదుర్చుకుంది, సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామును మొదలుపెడుతుంది

వీరితో ఒక అవగాహనా ఒప్పందము (ఎంఓయు)ను కుదుర్చుకున్నట్లుగా ఎఫ్ఎంసి ఇండియా ఈ రోజు ప్రకటించింది గోవింద్ వల్లభ్ పంత్ వ్యవసాయ మరియు టెక్నాలజీ విశ్వ విద్యాలయము (జిబి పంత్ విశ్వవిద్యాలయము), ఈ రోజున ఇండియా లోని ఎనిమిది రాష్ట్రాల వ్యాప్తంగా ప్రధాన వ్యవసాయ పాఠశాలల్లో తన బహుళ-వార్షిక స్కాలర్‌షిప్ ప్రోగ్రామును ప్రారంభిస్తోంది.

ఒప్పందం క్రింద, జిబి పంత్ విశ్వవిద్యాలయములో వ్యవసాయ శాస్త్రాల్లో డాక్టరేట్లు మరియు మాస్టర్స్ డిగ్రీలు పొందాలని ఆశిస్తున్న విద్యార్థులకు ఎఫ్ఎంసి వార్షికంగా నాలుగు స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేస్తుంది. తమ అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడానికి మరియు శాస్త్ర మరియు పరిశోధన కోసం వారి పట్టుదలను అభివృద్ధి చేయడానికి గాను ఎఫ్ఎంసి విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేస్తుంది. వ్యవసాయ శాస్త్ర మరియు పరిశోధనలో తమ నైపుణ్యాలను వృద్ధి చేసుకోవాలనుకునే మహిళలను ప్రోత్సహించడానికి గాను యాభై శాతం స్కాలర్‌షిప్‌లు మహిళా అభ్యర్థుల కొరకు కేటాయించబడ్డాయి. అదనంగా, ఎఫ్ఎంసి విశ్వవిద్యాలయంతో తన సమన్వయాత్మక పరిశోధన పనిని పెంపొందించుకుంటుంది.

"అంతర్జాతీయ శాస్త్రవేత్తల యొక్క సమృద్ధమైన వైవిధ్యతతో ప్రోత్సహించబడిన స్థానిక శాస్త్రవేత్తల యొక్క ధృఢమైన మూలమును అభివృద్ధి చేయడం ఎఫ్ఎంసి యొక్క ప్రతిభా వ్యూహముగా ఉంది, మరియు జిబి పంత్ విశ్వవిద్యాలయంతో మా భాగస్వామ్యము రంగం యొక్క నిపుణులు మరియు విద్యావేత్తల సహాయముతో విజయానికి బాటలు వేసుకోవాలనుకుంటున్న ఆశావాదుల సంభావ్యతను వెలికి తీస్తుంది” అన్నారు ఎఫ్ఎంసి ఇండియా అధ్యక్షులు శ్రీ రవి అన్నవరపు గారు. "భారతదేశంలో పరిశోధన మరియు అభివృద్ధి రంగం గణనీయంగా పురోగమిస్తుంది మరియు ప్రపంచ స్థాయిలో గుర్తింపును పొందుతోంది. ఎఫ్ఎంసి సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ కార్యక్రమం ద్వారా, విద్యార్థులు ఈ రంగం లోని కొందరు అత్యుత్తమ వ్యక్తుల చుట్టూ చేరి ప్రపంచ-శ్రేణి సంస్థలో పని చేస్తూ ఈ ఎదుగుదల యొక్క ముందు భాగములో నిలవాలని మేము ఆశిస్తున్నాము.”

వ్యవసాయ పరిశ్రమలోని అత్యంత ఘనమైన ఆవిష్కరణ మరియు అభివృద్ధి మార్గాలలో ఒకదానికి మార్గనిర్దేశం చేయడానికి 800 కంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు మరియు సహ సహాయకులు కలిగియున్న ప్రపంచ స్థాయి పరిశోధన మరియు అభివృద్ధి సంస్థతో, వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ లోపున ఎఫ్ఎంసి, శాస్త్రీయ సమాజం మరియు విద్యావేత్తలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంది.

భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, డాక్టర్ తేజ్ ప్రతాప్, వైస్ ఛాన్సలర్, జిబి పంత్ యూనివర్సిటీ, ఇలా అన్నారు: " ఎఫ్ఎంసి ఇండియాతో సమన్వయము మా సంస్థకు చాలా ముఖ్యం. పరిశోధనలో శ్రేష్టతను సాధించడానికై సమన్వయ రూపములో పనిచేయడం అనేది, మొత్తంగా ఈ రంగానికి సుదూర పర్యవసానాలను కలిగి ఉండే ఉమ్మడి ప్రయోజనాల యొక్క సమస్యలను పరిష్కరించడానికి గాను ఒక నియమంగా మారాలి. పరిశోధన ద్వారా వ్యవసాయంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరియు ఆ పని చేయడానికి ఎఫ్ఎంసి ఇండియా వారు చేపట్టిన ఈ చొరవ భారతీయ వ్యవసాయ రంగం లోని ఇతర హక్కుదారులకు స్ఫూర్తిని కలిగించగలదని నేను ఆశిస్తున్నాను.”

ఎఫ్ఎంసి యొక్క డా. ఆనందక్రిష్ణన్ బలరామన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ యొక్క డీన్ డా. కిరణ్ రవేర్కర్ మధ్య, జిబి పంత్ విశ్వవిద్యాలయం యొక్క వైస్-ఛాన్సలర్ డా. తేజ్ ప్రతాప్, పబ్లిక్ మరియు పరిశ్రమ వ్యవహారాల ఎఫ్ఎంసి డైరెక్టర్ శ్రీ. రాజు కపూర్, మరియు విశ్వవిద్యాలయం యొక్క డీన్‌లు మరియు విభాగాధిపతుల సమక్షములో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోబడింది.

ఎఫ్ఎంసి యొక్క బహుళ-సంవత్సర స్కాలర్‌షిప్ ప్రోగ్రాము, ఇండియా వ్యాప్తంగా ఎనిమిది విశ్వవిద్యాలయాలలో 10 పిహెచ్‌డి (ఎజి) మరియు 10 ఎం.ఎస్.సి (ఎజి) స్కాలర్‌షిప్‌లను అగ్రానమీ, ఎంటమాలజీ, పెథాలజీ, సాయిల్ సైన్స్ మరియు హార్టికల్చర్ వంటి బోధనాంశాలలో మద్దతు ఇవ్వడానికి ప్రతిన బూనింది. ఉపకార వేతనాల కార్యక్రమం క్రింద, కంపెనీలో పూర్తి స్థాయి ఉపాధి అవకాశాలలో ప్రాధాన్యతను పొందడానికి అదనంగా, అవార్డు పొందిన వారికి వారి సమగ్ర అభివృద్ధి కోసం ఇంటర్న్‌షిప్ మరియు పరిశ్రమ మెంటర్‌షిప్ కూడా అందించబడుతుంది.